జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలి
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 010 పద్దు కింద వేతనాలిస్తూ ఈహెచ్ఎస్ కార్డులను అందచేయాలన్నారు. చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. ఓపీఎస్ వారిని కూడా రెగ్యులర్ చేయాలన్నారు.