జూనియర్​ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్​ చేయాలి

సీఎం కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి లేఖ రాశారు. జూనియర్​ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్​ చేయాలని డిమాండ్​ చేశారు. నాలుగేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 010 పద్దు కింద వేతనాలిస్తూ ఈహెచ్​ఎస్​ కార్డులను అందచేయాలన్నారు. చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. ఓపీఎస్​ వారిని కూడా రెగ్యులర్​ చేయాలన్నారు.