బెదిరింపులకు లొంగేది లేదు

బెదిరింపులకు లొంగేది లేదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తమ సర్వీసులు క్రమబద్ధం చేయాలని కోరుతూ చేస్తున్న సమ్మె మంగళ వారం పన్నెండో రోజుకు చేరింది. కాగా  మంగళ వారం సాయంత్రం లోగా విధుల్లో చేరని పక్షంలో టెర్మినేట్ చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాలపై వారు స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.