గోధుమ పిండి వాహనాన్ని అడ్డుకున్న వ్యాపారులు

గోధుమ పిండి వాహనాన్ని అడ్డుకున్న వ్యాపారులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ కు మహారాష్ట్ర నుండి గోధుమ పిండి తీసుకువస్తున్న వాహనాన్ని వ్యాపారులు గురువారం అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ఆశీర్వాద్ గోధుమ పిండిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వ్యాపారులు వాహనాన్ని ఆపారు. వారి తనిఖీలో 200 బస్తాల గోధుమ పిండి పట్టుకున్నారు. ఈ సమాచారాన్ని వ్యాపారులు పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.