ఏడుపాయల పాలకవర్గం ఏర్పాటు

ఏడుపాయల పాలకవర్గం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ నూతన పాలకవర్గం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం జూన్ 2తో ముగిసిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచన మేరకు తిరిగి పాత పాలకవర్గంను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం సభ్యులుగా సాతెల్ల బాలాగౌడ్(మాజీ చైర్మన్), బుసనెల్లా మానెమ్మ, వీరుడి సిద్దిరాములు, ఉప్పరి వెంకటేశం, దొడ్ల మనోహర్, పోతుగంటి రఘువీర్, మరుమూల నాగభూషణం, అంబిర్ మోహన్ రావు, నాయికోటి సాయిలు, ఉప్పరి పెంటయ్య, రాగి చక్రపాణి, కొమ్ముల యాదాగౌడ్, రాజ్పేట బాగారెడ్డి, కాశమొల్ల శ్రీనివాస్, రావికోటి శంకర శర్మ( ఎక్స్ అఫీషియో సభ్యులు)లు ఉన్నారు.