పద్మశాలీల సంక్షేమానికి ప్రాధాన్యం
- ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని ఔరంగాబాద్ లో ఆదివారం పద్మశాలి సామూహిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తులను విస్మరించారన్నారు. బిఅర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బట్టి జగపతి, కౌన్సిలర్ భీమరి కిషోర్, నాయకులు కృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.