సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పద్మ 

సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పద్మ 

ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట్ మండలం నందిగామ గ్రామానికి చెందిన వై. హేమలత చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ కు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని మంజూరు చేయించారు. ఎల్ఓసి అనుమతి పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో నందిగామ ఎంపీటీసీ లద్ద సురేష్, ఉప సర్పంచ్ గెల్లు రాజ్యం, కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందె కొండల్ రెడ్డి,  నందిగామ మాజీ సర్పంచ్ సంగు స్వామి, నాయకులు రాజగోపాల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.