మెదక్ లో వ్యక్తి హత్య

మెదక్ లో వ్యక్తి హత్య
Man killed in Medak

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం బీడి కాలనీలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పట్టణంలోని రషీద్ కాలనీకి చెందిన ఎండీ. నిజాముద్దీన్(45)గా పోలీసులు గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద బైక్ ఉంది. సంఘటన స్థలానికి డిఎస్పి సైదులు, టౌన్ ఇన్స్పెక్టర్ మధు సందర్శించారు. పోలీస్ జాగిలాలు రప్పించారు.