అంగన్వాడి ఉద్యోగుల భిక్షాటన
ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె అంగన్వాడీల సమ్మె శుక్రవారం 19 వ రోజుకు చేరుకుంది. తమ నిరసనలో భాగంగా వారు భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రాజమణి, ఏ ఐ టీ యు సి జిల్లా నాయకురాలు రమాదేవి, అర్చన, సీఐటీయూ అనుబంధ యూనియన్ అంగన్వాడీ జిల్లా కోశాధికారి శైలజ,శశికళ,హేమలతదేవి, లావణ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.