1 లక్ష 38 వేలు సీజ్ ..

1 లక్ష 38 వేలు సీజ్ ..

సీఐ రాజు వెల్లడి స్టేషన్ ఘన్‌పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో రూ. 1 లక్ష 38 వేల 150 రూపాయలు సీజ్ చేసినట్లు సీఐ చట్ల రాజు తెలిపారు. కోడ్ ఆఫ్ ఎలక్షన్ అమల్లో భాగంగా గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో నాగ శ్రీనివాస్ అనే వ్యక్తి హనుమకొండకు నగదును తరలిస్తున్నాడు. సరియైన పత్రాలు లేనందున అట్టి మొత్తాన్ని సీజ్ చేసినట్లు సి ఐ తెలిపారు.