క్లాస్రూమ్లోనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రాజేంద్రనగర్: హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి మంగళవారం రాత్రి స్టడీ అవర్ ముగియగానే ఉరివేసుకున్నాడు.
కొన ఊపిరితో ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. ఈలోపే సాత్విక్ మృతిచెందాడు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలేజీలో ఒత్తిడి వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. సాత్విక్ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థులు, బంధువులు ఆందోళనకు దిగారు.