ప్రేమ వ్యవహారంలో కన్న కూతురిని చంపిన తల్లి

ప్రేమ వ్యవహారంలో కన్న కూతురిని చంపిన తల్లి

ముద్ర,తెలంగాణ బ్యూరో:-ప్రేమ వ్యవహారంలో కన్న కూతురిని చంపేసింది ఓ కసాయి తల్లి. హైదరాబాద్ - ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) అనే యువతికి మేన బావతో పెళ్లి కుదరింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడింది, అదే సమయంలో తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి, చీరతో ఉరేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.