వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మున్సిపల్ పరిధిలోని రామవరంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రామవరం ప్రాంతానికి చెందిన నమిల్ల రవళి (26) అదే ప్రాంతానికి చెందిన మధుసూదన్ రావు తో మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది.

భర్త వరకట్న వేధింపులు తాలలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కురేసుకొని రవళి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం జరిగిన నాటి నుండి వరకట్నం కొరకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని, తమ కూతురు ఆత్మ హత్యకు కారకుడైన మధుసూదన్ ,అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూ టౌన్ పోలీసులు మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.