నిజామాబాద్ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్లో జిల్లాలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన దాసరి హర్ష నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. అయితే శనివారం ఓ పరీక్ష రాయాల్సి ఉండగా.. హర్ష మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. అయితే కాసేపటికి స్నేహితులు వచ్చి చూడగా.. హర్ష హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించాడు. హర్ష మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్ష ఆత్మహత్య చేసుకునేంతా పిరికివాడు కాదని వారు చెబుతున్నారు. మరోవైపు హర్ష చదవుల్లో ప్రతిభ కనబరిచేవాడని.. ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదని అతని స్నేహితులు చెబుతున్నారు.