రాయికల్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై వీగిన అవిశ్వాస తీర్మానం

రాయికల్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై వీగిన అవిశ్వాస తీర్మానం

ముద్ర,రాయికల్ :- రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు , వైస్ ఛైర్మన్ గండ్ర రమాదేవి లపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో నర్సింహా మూర్తి తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక సమావేశానికి 12 మంది సభ్యులకు గాను ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కౌన్సిలర్ సభ్యులు హాజరైనట్లు తెలిపారు. దీంతో ఛైర్మన్ మోర హన్మాండ్లు , వైస్ ఛైర్మన్ గండ్ర రమాదేవి లపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగి పోయినట్లయింది. దీంతో గత కొద్ది రోజులుగా రాయికల్ మున్సిపల్ లో కొనసాగుతున్న అవిశ్వాస తీర్మానం ఉత్కంఠతకు తెర పడినట్లయింది.