తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా జిల్లా లో తెలంగాణ రన్

తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా జిల్లా లో తెలంగాణ రన్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "తెలంగాణ రన్" కార్యక్రమం జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల లో నియోజక వర్గాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ధర్మపురిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, కోరుట్ల నియోజకవర్గం లో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, హాజరై త్రివర్ణ పతాక రంగుల బెలూన్ లు వదిలి జెండా ఊపి తెలంగాణ రన్ ను ప్రారంభించారు.

తెలంగాణ ప్రగతిని చాటుతూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన తెలంగాణ 2k రన్ విజయవంతం చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మూడు నియోజక వర్గాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన, క్రీడల శాఖ భాగస్వామ్యంతో వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొని స్పూర్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత,ఎస్పీ ఎగ్గడి భాస్కర్, లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్, అదనపు కలెక్టర్ బి ఎస్ లత, మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, RDO మాధురి, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిదులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.