సిద్దిపేటలో 10 కే రన్ 5కె రన్

సిద్దిపేటలో 10 కే రన్ 5కె రన్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట సిద్దిపేటలో సోమవారం 10 కే,5కే రన్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ కూర రగోతం రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ,మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు, సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేత, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి పట్టణంలోని పలు వీధుల గుండా 10 కే, 5కే రన్లు నిర్వహించారు. సిద్ధిపేట రన్నర్ అసోసియేషన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరుగు పందెంలో విజేతలైన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.