గడపగడపకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ఎస్పి
![గడపగడపకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ఎస్పి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64871bf7d1221.jpg)
- BSP జిల్లా ఇంచార్జ్ రాపోలు నవీన్ కుమార్
హుజూర్ నగర్ టౌన్ ముద్ర: రాష్ట్రంలోని ప్రతి గడపగడపకు బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రానుందని ప్రగతిభవన్ ను కేసీఆర్ ఖాళీ చేస్తే మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చేది ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ రాపోలు నవీన్ కుమార్ తెలిపారు. సోమవారం హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జి కొండమిది నర్సింహా రావు, మండల కన్వనర్ మెరిగ మట్టపల్లి ఆధ్వర్యంలో మాధవరాయిని గూడెం, మర్రిగుడెం, కరక్కాయల గూడెం, బూరుగడ్డ, గోపాల పురం గ్రామాలలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ బహుజనుల ఆశాజ్యోతి, బహుజన రాజ్యాధికార రథసారథి, త్యాగశిలి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన త్యాగం ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రతి గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాబోయేది బహుజన్ సమాజ్ పార్టీయేనని కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగు ఉపేందర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నందిగామ గోవింద్, ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, అమరవరపు వెంకటేశ్వర్లు, పేదపంగు సురేష్, వీరంజనేయులు,కలకుండ వీరస్వామి,జిల్లపల్లి జోసఫ్, నందిగామ గోపి, మెరిగ సూర్యప్రకాష్,బచ్చల విజయ్, గద్దల సూరి, నవీన్, కొండ్రు ప్రసన్న, కొండ్రు హరీష్,నందిగామ చంటి, కొండ్రు పండు,ఏలేటి ప్రణయ్,నందిగామ గోపి,శివ తదితరులు పాల్గొన్నారు.