సవర్లచ్చమ్మ తల్లి అనుగ్రహముతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
![సవర్లచ్చమ్మ తల్లి అనుగ్రహముతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646a06bab3f66.jpg)
- ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
- దైవ చింతనతో మానసిక ప్రశాంతత
- దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మోతే, ముద్ర:సవర్లచ్చమ్మ తల్లి అనుగ్రహముతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం మోతె మండలం కర్కాయాలగూడెం గ్రామంలో సవర్లచమ్మ తల్లి పండగ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని ఆ తల్లిని వేడుకున్నారు.దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారిని ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, యువత అధ్యక్షులు పాషా, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, గుండాల గంగులు, వాసంశెట్టి రమేష్, బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, పలుసు మాల్సూర్ , మిక్కిలినేని సతీష్, డాక్టర్ మల్లికార్జున్, కారింగుల శ్రీనివాస్ గౌడ్, నర్సిరెడ్డి,రామ్మూర్తి, మధుసూదన్ రెడ్డి, గుండాల వీరస్వామి,మాజీ ఎంపీటీసీ ఉపేందర్, గుండ్ల శీను, ప్రభాకర్ రెడ్డి, పిట్టల నగేష్, టిఆర్ఎస్ నాయకులు, కుల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.