ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు అంటున్నారు

ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు అంటున్నారు
  • అరణ్యవాసానికి వెళ్లాను అనుకోండి
  • యుద్ధం ఆరంభమైంది
  • చూసుకుందాం హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు అని కొందరు అంటున్నారు.. అరణ్యవాసానికి వెళ్లాననుకోండి యుద్దం ఆరంభమైంది.. చూసుకుందాం అంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్ ఆసక్తికర వ్యా్ఖ్యాలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ లో జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం సరైన ప్రణాళికలు లేక అభివృద్ధిలో వెనుకబడిందని తీవ్రంగా విమర్శించారు .కొంత మంది తాము చేస్తున్న మంచి కార్యక్రమాలకు మానవత్వాన్ని మరిచి పదే పదే అడ్డు పడుతున్నారని తెలిపారు.  జెండా ఎజెండా అనేది లేకుండా సేవలు చేస్తున్నానన్నారు.

అందరి సహాయ సహకారాలతో కొత్తగూడెం బిడ్డగా ప్రాణం ఉన్నంతవరకు సేవాకార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. కొత్తగూడెం జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్న ప్రజాప్రతినిధులు సక్రమంగా ప్రణాళికలు చేయలేదని.. అందుకే కొత్తగూడెం నియోజకవర్గం అంతగా అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. సుజాతనగర్ కొత్తగూడెం నియోజకవర్గానికి ముఖ ద్వారమని.. ప్రజల ఆశీస్సులు ఉంటేనే కొత్తగూడెం నియోజకవర్గంలో గెలుపు సాధ్యమనన్నారు. కొత్తగూడెంకు మార్పు అవసరం.. కొత్తగూడాన్ని మరో కొత్తగూడెంగా తీర్చిదిద్దేందుకు కొత్త నాయకత్వం అవసరమని.. అందరం ఆ దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహాభారత యుద్దానికి ముందు పాండవులు అరణ్యవాసం వెళ్లారని తర్వాత యుద్ధం ఆరంభమైందని.. చూసుకుందామని హెచ్చరిక జారీ చేశారాయన. తనకు జెండా ఎజెండా అంటూ ఏమీ లేదని.. మీరు ఏదంటే తాను ఆ పార్టే నని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీకి సిద్ధమేనని పరోక్షంగా హెచ్చరించారు .