పెళ్ళింట విషాదం....
అక్క పెళ్లి రోజునే తమ్ముడు మృతి....
టేకులపల్లి, ముద్ర: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని ఓ కుటుంబంలో పెళ్లిరోజున విషాదం చోటుచేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని బోడ్ రోడ్ సెంటర్ కు చెందిన వెనుగంటి రవీంద్ర చారి, వాణి దంపతులకు కుమార్తె నవ్య, కుమారుడు రేవంత్ ఉన్నారు. రేవంత్ కు (21) చిన్నతనం నుంచి రెండు కాళ్లు పని చేయడం లేదు. తల్లిదండ్రులు చికిత్సకు హైదరాబాద్ కేరళ సైతం తీసుకెళ్లారు. అనేక ఆసుపత్రిలో తిరిగి వైద్యం చేయించారు అయినా ఫలితం లేకపోయింది. చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు పడుతూ కుమారుడిని చికిత్స చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రోజున కుమార్తె నవ్య వివాహం సూర్యాపేట లోని ఓ గ్రామానికి చెందిన తన బంధువుల కుటుంబంలోని ఓ వ్యక్తికి ఇచ్చి శుక్రవారం పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ క్రమంలో రేవంత్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. దీంతో సులానగర్ పిహెచ్సి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కొరకు కొత్తగూడెం తరలించారు. కొత్తగూడెం ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ రేవంత్ మృతి చెందాడు. కుటుంబంలో ఓవైపు పెళ్లి వేడుక జరుగుతున్న క్రమంలో కుమారుడు చనిపోవడంతో పెళ్ళంట విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి జరుగుతున్న ఇంట శోకసముద్రాల నడుమ అంత్యక్రియలు జరిగాయి.