దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ .రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి,అన్నారు.రేగొండ మండల కేంద్రంలో పి ఏ సి ఎస్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రాంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతు, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రములో రైతులకు న్యాయం చేయడానికి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది అన్నారు.రైతులు ఎవరు అదర్య పడద్దుని దళారులను నమ్మి మోస పోవద్దని తెలిపారు.

ప్రతి పక్ష నాయకులు రైతుల్ని తప్పుతోవా పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జడ్పీటీసీ సాయిని విజయ, పి ఏ సి ఎస్ చైర్మన్ నడిపెళ్లి విజ్జాన్ రావు,వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు అంకం రాజేందర్, రేగొండ టౌన్ అధ్యక్షులు కోలేపాక భిక్షపతి,మోడెమ్ ఉమేష్ మైస భిక్షపతి, సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు.