గన్ను పడదామనుకున్నా | Mudra News

గన్ను పడదామనుకున్నా | Mudra News

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్నలలో చేరదామనుకున్న, గన్ను పడదామనుకున్న కానీ, ప్రజల నాడి పట్టుకున్నా‘ అని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడారు. భద్రాచలం ప్రాంతంలో అన్నలను చూసుకుంటూ పెరిగానని తెలిపారు. అన్నలను ఆదర్శంగా తీసుకొని అడవి బాట పట్టాలని, పేదలకు సేవ చేయాలనుకున్నాన్నారు. కానీ, ఉన్నత చదువులు చదవడం వలన ఈ స్థాయిలో ఉన్నానన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో తాను ఏమి చేసినా కొన్ని పత్రికలు, చానళ్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తేనే భయపడతానని తెలిపారు. మీడియా సంస్థలు నిజాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజల మన్ననలను పొందాలన్నారు.