మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని మంత్రికి వినతి 

మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని మంత్రికి వినతి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి పిఆర్ టియు నాయకులు వినతి పత్రం సమర్పిచారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియు టియస్  రాష్ట్ర అధ్యక్షుడు  పింగిలి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు యాళ్ల    అమర్నాథ్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి బోయినిపెల్లి  ఆనంద్ రావు, చిట్నేని  విజయ్ కుమార్, సంగ శ్రీధర్, దేవేందర్ ,మహేష్, సతీష్ రావు పాల్గొన్నారు.