ఎమ్మెల్యేను కలిసిన మల్యాల వాసులు - కొండగట్టులో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం 

ఎమ్మెల్యేను కలిసిన మల్యాల వాసులు - కొండగట్టులో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం 

ముద్ర, మల్యాల:మల్యాల మండల కేంద్రంలోని ఎన్నో ఏళ్ల జగ్గని ఒర్రె సమస్య అభివృద్ధికి ప్రభుత్వం 4 కోట్ల 17 లక్షలు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, పెద్ద ఎత్తున స్థానికులు శుక్రవారం కొండగట్టులో ఉన్న ఎమ్మెల్యే రవిశంకర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా మల్యాల సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకo నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూస వెంకన్న, బోడ గోవర్ధన్, గాజుల రాములు, మంద నాంపల్లి, మెడిశెట్టి శ్రీనివాస్, సంకుర్తి సునీల్, వార్డు సభ్యులు బొల్లారపు నరేష్, తదితరులు పాల్గొన్నారు.