సిద్ధార్థ ఆషాడ మాస బోనాలు

సిద్ధార్థ ఆషాడ మాస బోనాలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో సిద్ధార్థ విద్యా సంస్థ ఆధ్వర్యంలో  రవీంద్ర ప్లే స్కూల్లో ఆషాడ మాసం బోనాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బోనాలతో పాటశాల నుంచి ర్యాలీగా  గాజుల పోచమ్మ వరకు వెళ్లి అమ్మవారికి  బోనాలు సమర్పించారు.

ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, పోతురాజు వేషాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్స్ బి. శ్రీధర్ రావు, బి. హరిచరణ్ రావు, బి. రజిత , బి. అజిత, జే. మౌనిక, నిర్వాహకులు సుమన్ రావు కె. కిషన్, జే. రాజు  గాజుల పోచమ్మ ఆలయ చైర్మన్ గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.