జగిత్యాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

జగిత్యాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని పలు చర్చ్ లలో ఆదివారం  ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా  జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ సి ఎస్ ఐ వెస్లీ చర్చీతో పాటు, దరూరు క్యాంపు, గోవింద్ పల్లి, బీట్ బజార్ చర్చీలలొ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ జీవరత్నం ప్రత్యేక ఈస్టర్ సందేశం అందించారు. పలు చర్చిలలో  పెద్ద సంఖ్యలో  క్రైస్తవులు పాల్గొన్నారు. అనంతరం మహిళలు ప్రత్యేక ఈస్టర్ భక్తిగీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమాల్లో  సీఎస్ఐ వెస్లీ చర్చి  సంఘ నాయకులు  విమల నారాయణ, సునంద్, డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.