జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు దరకాస్తుల ఆహ్వానం
![జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు దరకాస్తుల ఆహ్వానం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6435479c42858.jpg)
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరుకొరకు అర్హులైన లభ్దిదారులు దరకాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐ.డి కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండి ఎలాంటి గృహము, ఆస్తులు లేకుండా నిరుపేదలై అర్హులు దరఖాస్తు చేసుకొవలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ మంజూరి కొరకు మీసేవ ద్వారా ఈ నెల 12 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకొవలని సూచించారు.