నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గ రూపు రేఖలు మార్చి అభివృద్ధిలో అగ్రభాగా నిలుపుతానని ఎమ్మెల్యే వనం వెంకటేశ్వరావు అన్నారు. మున్సిపాలిటీలోని16, 22 వార్డు లో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 16,22 వార్డు లో సుమారు 50 లక్షల రూపాయలతో, ఉర్దూగర్ బిల్డింగ్ లో లైబ్రరీ నిర్మాణం, గొల్లగూడెం స్మశాన వాటిక అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. వనమా రాఘవేందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు, 16వ వార్డ్ కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, జయంతి మసూద పాల్గొన్నారు.