సీతారాముల కల్యాణానికి ముస్తాబు

సీతారాముల కల్యాణానికి ముస్తాబు
  • 50 వేలకు పైగా భక్తుల కోసం భోజన వసతి
  • ఫోటో రైట్ అప్.. కళ్యాణానికి ముస్తాబైన అపర భద్రాద్రి

జమ్మికుంట , ముద్ర .... అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి అధికారులు ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణమంటపాన్ని విద్యుత్ దీపాలు పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చలువ పందిళ్ళని ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

సీతారాములకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్పు శాసనమండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు పర్యవేక్షణలో దాదాపు 300 కంటే పైగా పోలీసులు శాంతి భద్రతల నిర్వహణకు రానున్నారు. వివిధ మండలాల నుండి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు. 50 వేలకు పైగా భక్తులకు జమ్మికుంట రైస్ పిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.