Chandrababu Naidu - నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu - నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

ముద్ర,ఆంధ్రప్రదేశ్- సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు చంద్రబాబు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లలో ప్రజాగళం నిర్వహించనున్న చంద్రబాబు.. కౌతాలం, గూడూరులో బహిరంగ సభల్లోనూ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం కౌతాలం వెళ్లనున్న చంద్రబాబు.. రాత్రికి గూడూరులో బస చేయనున్నారు.