టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను ఫ్యామిలీ...

టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను ఫ్యామిలీ...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో అరెస్టై విడుదలైన శ్రీనుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలోకి శ్రీనుతండ్రి, అన్న సుబ్బరాజు, ఇతర కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా కోడికత్తి కేసుపై శ్రీను అన్న సుబ్బరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయని నేరానికి తన తమ్ముడు ఆరేళ్ల జైలు జీవితం గడిపాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వల్లే శ్రీను బయటకు వచ్చాడన్నారు.