గాంధీభవన్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు..!

ముద్ర,తెలంగాణ:- హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి సమీరుల్లాఖాన్‌ ముందే కార్వాన్‌కు చెందిన నేతలు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్‌ కో ఆర్డినేషన్‌ సమావేశంలో ఈ విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా వీడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎంత నచ్చజెప్పినా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ఇక చేసేదేమి లేక గాంధీభవన్‌ నుంచి అసహనంతో వెళ్లిపోయారు ఎంపీ సమీరుల్లాఖాన్‌.