డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స  ఏర్పాటు....

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స  ఏర్పాటు....

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:జిల్లాలో వరదలు,భూకంపాలు,అగ్ని ప్రమాదాలు,భవనాలు కూలిపోవడం,ప్రాణాలను రక్షించడం వంటి విపత్తు నిర్వహణ  విధులు  నిర్వహించేందుకు జిల్లాలో 12 మందితో కూడిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లాలో డిఆర్ఎఫ్ ఏర్పాటుచేసి , హైద్రాబాద్ లోని నాగోలులోనీ డీఅర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో   డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స శిక్షణ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం వర్షాకాలంలో వరదలు,ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి పరిష్కరించేందుకు సహాయం చేసేందుకు, గానూ ఇద్దరు ఆర్ఎస్ఐ  లతో పాటు పది మంది కానిస్టేబుల్స్ (2+10) తో డి ఆర్ ఎఫ్ టీమ్ ఏర్పరిచి,హైద్రాబాద్ లోని డి ఆర్ ఎఫ్ శిక్షణ కేంద్రం నందు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందినీ అన్నారు
ఈ సుశిక్షితులైన డి ఆర్ ఎఫ్ సిబ్బంది భారీ వర్షాలు,వరదలు,ఫైర్ అసిసిడెంట్స్, భవనాలు కూలిపోయినవుడు,ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయ పర్చుకుంటు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
జిల్లా డి ఆర్ ఎఫ్  టీమ్ కి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చినందుకు జిహెచ్ఎంసి  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ ప్రకాష్ రెడ్డి కి  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.