రాహుల్ ‘తుగ్లక్’ నివాసం ఖాళీ
న్యూఢిల్లీ: రాహుల్గాంధీ తుగ్లక్రోడ్డులో ఉన్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. రాహుల్ ఇంట్లోని సామాగ్రిని సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్కు ట్రక్కుల్లో తరలించడం శుక్రవారం కనిపించింది. రాహుల్గాంధీపై సూరత్కోర్టు శిక్ష అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 22 ఏప్రిల్ వరకూ ఇంటిని ఖాళీ చేయాలని లోక్సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. దీనిపై రాహుల్ లోక్సభ సచివాలయానికి లేఖ రాశారు. ఆ లేఖలో తాను నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయన్నారు. నోటీసుల్లో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానన్నారు. 2004లో అమేథీ నుంచి ఎన్నికల్లో మొదటిసారిగా గెలిచినప్పుడు 2005లో ఆయనకు ప్రభుత్వం ఈ భవనాన్ని కేటాయించింది.