కాంగ్రెస్ తోనే అభివృద్ధి : ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేట, ముద్ర : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వర్కల శ్రీను, వర్కల మల్లేశం, నారపాక రాజు, నారపాక శ్రీను, వర్కల భరత్, భాశమల్ల క్రాంతి, వర్కల సంతోష్, నారపాక అజయ్, వర్కల వినేయ్, వర్కల గణేష్, వర్కల సురజ్, వర్కల గుణ, సల్ల ఉపేందర్, రాపోలు సుభాష్, బోడ్డు మచ్చగిరి, అకెనపల్లి ఉపేందర్, వర్కల ప్రవీణ్, వర్కల సురేశ్,భాశమల్ల ప్రవీణ్, సల్ల వెంకటేష్ లు ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు.