కేంద్ర మంత్రిని కలిసిన మాజీ ఎంపీ..

కేంద్ర మంత్రిని కలిసిన మాజీ ఎంపీ..

ఆలేరు (ముద్ర న్యూస్): భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మత్య. పషుసంవర్డక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలను శుక్రవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డిడిబి పథకం ద్వారా ధరఖాస్తు చేసుకున్న వారందరికీ న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ 1కోటి నుండి 2కోట్ల రూపాయల వరకు సబ్సిడీ తో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద లబ్ధిదారులకు మంజూరు చేయాలని కోరారు. ఈ విధంగా చేయడం వలన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకంపై అవగాహన కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.....