8మండలాల కు 4రోజులు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా బంద్

8మండలాల కు 4రోజులు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా బంద్

ముద్ర ప్రతినిధి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కి వచ్చే గోదావరి నీరు హైదరాబాద్ మెట్రో బోర్డుపైపులైన్ల మరమ్మత్తు పనుల నిమిత్తం నేటి నుంచి 4 రోజులు    మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని కార్య నిర్వాహక ఇంజనీర్, డి.లక్ష్మణ్ ఒక పత్రికాప్రకటన లో తెలిపారు.  హైదరాబాద్ మెట్రో బోర్డు  మరమ్మత్తు పనుల నిమిత్తం నీటి సరఫరా నిలిపివేస్తున్నందున ప్రజలు గమనించాలని తెలియజేశారు. జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి,  రాజాపేట, ఆలేరు, గుండాల, బీబీనగర్, వలిగొండ, భువనగిరి, ఆత్మకూరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, రామన్నపేట(8) మండలాల పరిదిలోని ఆవాసాలకు నీటి సరఫరాను నిలిపి వేయడం జరుగుతుందని తెలిపారు.