ముదిరాజ్ సంఘం నూతన కమిటీ సభ్యులకు సన్మానం

ముదిరాజ్ సంఘం నూతన కమిటీ సభ్యులకు సన్మానం

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన బోయిని వెంకటస్వామినీ, ఉపాధ్యక్షుడు గంగాదేవి వెంకటేష్ ను, కోశాధికారి బోయిని చంద్రమోహన్, గౌరవ అధ్యక్షుడు బోయిని గండయ్యలను టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పైల్ల దేవేందర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు రాజయ్య, తులసి రాములు, గంగదేవి రవి, లక్ష్మణ్, కొండల్, తదితరులు ఉన్నారు.