30 ఏళ్ల లో చేయలేని అభివృద్ధిని రెండేళ్ల లో చేసి చూపించా బీఆర్ఎస్ అభ్యర్థి,  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

30 ఏళ్ల లో చేయలేని అభివృద్ధిని రెండేళ్ల లో చేసి చూపించా  బీఆర్ఎస్ అభ్యర్థి,  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ప్రజా ఆశీర్వాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  తాండూరు మండలం నారాయణపూర్, వీర్ శెట్ పల్లి, గోనూర్, బజ్వర్ గ్రామాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్ల లో చేయలేని అభివృద్ధిని రెండేళ్ల లో చేసి చూపించానని వెల్లడించారు. త్వరలో తాండూరు నలువైపులా నాల్గు లైన్ల రహదార్లు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. తాండూరు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో ప్రేమ. అందుకే అభివృద్ధికి అధిక నిధులు ఇస్తున్నారు. అందించారు .రూ1670 కోట్లు ఇచ్చారు, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక జిమ్మిక్కు అని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు.  ప్రజలకు కూడా స్పష్టత వచ్చిందని అభివృద్ధి చేసే వారికి ఓటేస్తామంటున్నారని తెలిపారు. 24 గంటల కరెంటు ఇవ్వాలంటే... కేసిఆర్ ఏ రావాలి. కాలేశ్వరం నీళ్లు రావాలంటే కేసిఆర్ రావాలి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే  ఐదు గ్యారెంటీల పేరిట కర్ణాటకలో మోసం చేసింది. రైతుల పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 57 ఆత్మహత్యలు కర్ణాటకలో జరిగాయి. కర్నాటక కరెంట్ లేదు  రైతాంగానికి పొద్దంతా ఒక గంట  రాత్రికి మూడు గంటలు ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు..
 మాటల గారెడితో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు, తాండూరు ప్రజలంతా పనిచేసే వారికి పట్టం కట్టండి అని అన్నారు.