కాంగ్రెస్ ను నమ్మితే మోసపోవడం ఖాయం.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ ను నమ్మితే మోసపోవడం ఖాయం..  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: మోసపూరిత కాంగ్రెస్ పార్టీ మాటలను ఎవరు నమ్మి మోసపోవద్దని పాత తాండూరు యువకులు అన్నారు. పాత తాండూరు 16,18 వార్డుల యువకులు మంగళ వారం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి మద్దతు తెలుపుతూ యువ నాయకుడు రితేష్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తాండూరు నియోజకవర్గ యువతను గుర్తించేది కేవలం పైలెట్ రోహిత్ రెడ్డి మాత్రమే అని తాండూర్ బీఆర్ఎస్ యువ నాయకుడు రితిష్ రెడ్డి  పేర్కొన్నారు. తాండూరు అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని  అన్నారు. బీఆర్ఎస్ లో చేరిన యువకులు తాము పైలట్ రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు.