ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లైబ్రేరి నిరుద్యోగుల వినతి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో లైబ్రేరి నిరుద్యోగులు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నూతన జాతీయ విద్య విధానం ప్రకారం ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఖచ్చితంగా గ్రంథపాలకులను నియమించాలన్నారు. డి ఎస్సీలో లైబ్రేరియన్ పోస్టులు కలిపి మెగా డి ఎస్ సి నోటిఫికేషన్ విడుదల చెయాలి అని లైబ్రేరియన్ నిరుద్యోగులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.