అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ముద్ర, మల్యాల:కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం కావడంతో అంజన్నను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తలనీలాలు సమర్పించిన భక్తులు కోనేరులో స్నానమాచరించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రకార మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకలు నిర్వహించారు. ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

 నేడు ఆధ్యాత్మిక దినోత్సవo...

తెలంగాణ అవతరణ, దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కొండగట్టు అంజన్న ఆలయంలో బుధవారం ధార్మిక ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకములు, హోమములు, సంగీత సంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.