రాజారoలో యువకుల ఘర్షణ - ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

రాజారoలో యువకుల ఘర్షణ - ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

ముద్ర, మల్యాల: మండలంలోని రాజారం గ్రామంలో ఆదివారం రాత్రి  సినిమా ప్రదర్శన వద్ద జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రoగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు.. మద్యం మత్తులో ఇద్దరు యువకులు కర్రలు, ఇనుప రాడులతో గుర్రo ప్రవీణ్, వెంకటేష్ లపై దాడికి పాల్పడగా, ప్రవీణ్ తల పగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తి వెంకటేష్ ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి పాల్పడింది శివరాత్రి నరేష్, భాగ్యరాజ్ గా భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.