కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కలెక్టర్ శరత్

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కలెక్టర్ శరత్

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని సోమవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ దర్శించుకున్నారు. ధర్మపురి అసెంబ్లీ ఫలితాలకు సంబందించిన తాళం చెవి మాయంపై కొండగట్టు జేఎన్టీయూ కళాశాలలో జరుగుతున్న విచారణకు హాజరైన కలెక్టర్ శరత్ అనంతరం అంజన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించారు. అలాగే ఆశీర్వదిoచి, స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు.