ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

 జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి :  ప్రజావాణి  ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల కు సంబంధించిన దరఖాస్తులు మొత్తం 52  స్వీకరించినట్లు తెలిపారు.  అందిన దరఖాస్తులను  వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి.వేణుగోపాల్, ఆర్. డి. ఓ. పద్మావతి,  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.