ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
![ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643d722967b42.jpg)
జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల కు సంబంధించిన దరఖాస్తులు మొత్తం 52 స్వీకరించినట్లు తెలిపారు. అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి.వేణుగోపాల్, ఆర్. డి. ఓ. పద్మావతి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.