జేఎన్టీయూహెచ్ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు 

జేఎన్టీయూహెచ్ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు 

ముద్ర, మల్యాల: కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల 2022-23 విద్యా సంవత్సర వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమం ముందు  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ నివేదిక చదివి వినిపించారు. అనంతరం విద్యార్థుల నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్ ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో చీఫ్ గెస్ట్స్ ప్రొఫెసర్ కట్ట నర్సింహారెడ్డి, వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ P.K.S మాధవన్, రిజిష్టర్ మంజూరుహుస్సేన్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా పలువురు గెస్ట్స్ మాట్లాడుతూ హైదరాబాద్ కళాశాలలకు సమానంగా అన్ని అంశాలలో ఇక్కడి జేఎన్టీయూ కళాశాల పోటీ పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగం చేసి, కుటుంబాన్ని పోసిoచడమే బాధ్యతగా భావించకుండా.. సామాజిక సేవా, మానవతా విలువలు కల్గి ఉండాలన్నారు.