పేదల పాలిట వరం కళ్యాణ లక్ష్మి

పేదల పాలిట వరం కళ్యాణ లక్ష్మి
  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:పేదరికంలో మగ్గుతున్న పేదింటి ఆడబిడ్డలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప వరంలా మారిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో 37 మంది లబ్ధిదారులకు దాదాపు 37,41,292 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

కళ్యాణ లక్ష్మి పథకాన్ని అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపొలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్,పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, భువనగిరి మార్కెట్ డైరెక్టర్ దొడ్డమోని  చంద్రం యాదవ్,కౌన్సిలర్లు గుండు మధు, దేవరాయ కుమార్, కుడికాల అఖిల బలరాం, కొంగరి కృష్ణ, సామల మల్లారెడ్డి, పెద్దల చక్రపాణి,నాయకులు గునిగంటి మల్లేష్ గౌడ్, చేరాల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.