ప్రొపెసర్ ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి.
![ప్రొపెసర్ ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి.](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64cf63af76896.jpg)
- బుర్ర శ్రీనివాస్ గౌడ్
మోత్కూర్ (ముద్ర న్యూస్ ):తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫైసర్ ఆచార్య జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి బిఆర్ఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఆదివారం మోత్కూరు లో ఆచార్య జయశంకర్ సార్ 89 వ, జయంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం లో కీలకపాత్ర పోషించిన జయశంకర్ సార్ మలిదశ ఉద్యమానికి నాటి ప్రతిపక్ష నేత కేసీఆర్ కు వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నోముల రమేష్ నేత, స్థానిక బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు లాధినేని సోమేశ్వర్, జినుకల వెంకన్న, బండారు స్వామి, ఇటుకల రాజు, అల్లే యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, నాతి సోమలింగం తదితరులు పాల్గొన్నారు.