గులాబీ పార్టీలోకి భారీ చేరికలు

గులాబీ పార్టీలోకి భారీ చేరికలు

గుండాల ఆగస్టు 13 (ముద్ర న్యూస్): మండలంలోని  అనంతారo గ్రామం నుండి  ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి  సమక్షంలో,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా,గొంగిడి  మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని బిజెపి ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని,సూచించారు.కారమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మ చిన్నపరెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు బొంగు శ్రీశైలం యాదవ్, సెక్రటరీ కుమ్మరి కుంట్ల రవీందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చెరుపల్లి సిద్ధులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టరు చిన్న నరసయ్య, మండల ఉపాధ్యక్షుడు భాషేటి వీరస్వామి ,విద్యార్థి విభాగం మండల జనరల్ సెక్రెటరీ కాలం రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు