సత్తుపల్లిలో మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్ పర్యటన

సత్తుపల్లిలో మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్ పర్యటన

సత్తుపల్లి, ముద్ర: నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ 
అజయ్ కుమార్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి విచ్చేశారు.  మండల కేంద్రంలో రూ.10.50 కోట్లతో నిర్మాణం కానున్న 50 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు, రూ.1.93 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పర్యవేక్షక ఇంజనీర్, నీటి పారుదల శాఖ కార్యాలయ భవనాన్ని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీ లు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, సత్తుపల్లి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ  మధు, జిల్లా కలెక్టర్  గౌతమ్, జెడ్పి చైర్మన్  కమల్ రాజ్, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి. చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు, ఎంపి లు,  పాల్గొననున్నారు.